జామ లో నులి పురుగుల నివారణ

జామ (Psidium guajava) భారతదేశంలోని ముఖ్యమైన వాణిజ్య పంటలలో ఒకటి. జామ దాని విలక్షణ రుచికి మరియు  సువాసనకు ప్రసిద్ధి చెందినది అంతేకాక, ఈ పండులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల కారణంగా జామ పండు కూడా సూపర్ ఫ్రూట్లలో ఒకటిగా పేర్కొనవచ్చు.

జామ పంట అనేక తెగుళ్లు మరియు చీడ పీడలకు గురయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం జామ సాగులో నులి పురుగులదాడి ఒక పెద్ద  సమస్యగా మారింది. మన రైతులకు ఈ నులి పురుగుల నియంత్రణ తల నొప్పిగా మారింది. జామ పంటను దాడి చేసి నులి పురుగులు మెలియో డొ గయిన్  ఎంటెరోలోబై  [Meloidogyne Enterolobii]  జాతికి చేరినది.

నులి పురుగుల దాడి లక్షణాలు:

  • ఆరోగ్యవంతమైన మొక్కలతో పోలిస్తే, నులి పురుగుల దాడి ఉన్న మొక్కలు బలహీనంగా ఉంటాయి.
  • నులి పురుగుల దాడి మొక్కల్లో పెరుగుదల ఆగిపోతుంది. మొక్కలు పసుపు లేదా పాలిపోయిన పచ్చరంగులోకి మారిపోతాయి. మట్టిలో తగినంత తేమ ఉన్నప్పటికీ, వేడి వాతావరణంలో మొక్కలు సులభంగా వాడిపోతాయి.
  • దాడి మొక్కల ఆకులు కాంస్య రంగులోకి మారుతాయి.
  • వేర్ల మీద బుడిపెలు ఏర్పడడంతో పాటు వేర్లు బాగా ఉబ్బిపోతాయి.

నులి పురుగుల వ్యాప్తికి గల కారణాలు:

  • బంకమట్టి మరియు  తేలిక నేలలు నులిపురుగుల వ్యాప్తికి అత్యంత అనువుగా ఉంటాయి.
  • సాధారణంగా, మట్టి ఉష్ణోగ్రతలు 21-26°Cగా ఉన్నప్పుడు నులిపురుగుల ఉధృతి అత్యంత తీవ్రంగా ఉంటుంది.
  • తెగులుకి అనువైన పంటలు లేదా ఒకే రకం పంటలు సాగుచేయడం.

నివారణ చర్యలు:

  • నులిపురుగుల దాడి సోకని మొలకలు మాత్రమే నాటాలి.
  • నులి పురుగుల దాడి సోకిన ప్రాంతాల్లోని మొక్కలు/మట్టి కొత్త ప్రదేశాల్లోకి తీసుకురాకూడదు.
  • నులి పురుగుల దాడి సోకిన మొక్కలకు పారించిన నీళ్లు తెగులు లేని మొక్కలకు చేరకూడదు. ఒకవేళ చేరితే, నులిపురుగులు వాటికి కూడా వ్యాపిస్తాయి.
  • నులి పురుగుల దాడి సోకిన ప్రదేశంలో ఉపయోగించిన పనిముట్లు మరియు ఉపకరణాల్లో కూడా నులిపురుగులు ఉంటాయి. కాబట్టి, పనిముట్లు ఉపయోగించే ముందు వాటిని పూర్తిగా శుభ్రం చేయాలి.
  • నులిపురుగులకు ఆశ్రయం ఇవ్వని పంటలతో (మొక్కజొన్న, జొన్న) కనీసం రెండేళ్లు పంటమార్పిడి చేయడం ద్వారా నులిపురుగులు ఆకలితో చనిపోతాయి.
  • మట్టిను క్రిమిరహితం చేయడం ద్వారా ప్రభావవంతమైన నియంత్రణ లభిస్తుంది.
  • పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూడాలి. [ఒకవేళ ఉంటే, అవి ప్రత్యామ్నాయ ఆతిధేయిలుగా ఉంటూ ప్రధాన పంటను నాశనం చేస్తాయి].

రసాయన నియంత్రణ:

మార్షల్ @ 2 మి.లీ / లీ  + తపస్ పుష్టి హ్యూమిక్ యాసిడ్ @ 2 మి.లీ / లీ + ఏకోనీం (10000ppm) @ 1 మి.లీ / లీ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి.

వేలం ప్రైమ్ @1.5 మి.లీ / లీ + జీవరస్ @ 2 మి.లీ / లీ + ఏకోనీం @1 మి.లీ / లీనీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి.

జీవ నియంత్రణ:

-ట్రైకోడెర్మా, సూడోమోనాస్ మరియు పాసిలోమేసిస్ జీవులను పశువుల ఎరువుతో కలపి జీవులను మరింత అభివృద్ధి చేసుకొని మొక్కలు నాటే ముందు, నాటు చేసే గోయ్యాలో  మట్టికి 1 కిలో అభివృద్ధి చెందిన ఎరువు ప్రతి మొక్కకి వేసుకోవాలి.

-ట్రైకోడెర్మా, సూడోమోనాస్ మరియు పాసిలోమేసిస్ అభివృద్ధి వేప పిండిలో 20 రోజుల పాటు కలిపి కూడా చేసుకొని ఆ మిశ్రమాన్ని 10 కేజీలు తీసుకొని 100 లీ నీటికి కలుపుకుని నులి పురుగు సోకిన మొక్కల చుట్టూ పిచికారీ చేసుకోవాలి.

-జినాబియో నెమటోడ్ @ 5 మి.లీ / లీ (లేదా) పెరఫానెమాట్ @ 2 మి.లీ / లీ (లేదా) సేఫ్ రూట్ @ 2 కేజీలు/ ఎకరానికి కలుపుకొని పిచికారీచేసుకోవాలి.

 

                          ********************************

Created by:

Kalpana Indukuri,

SME(Intern),

BigHaat.

___________________________________________________________

For more information kindly call on 8050797979 or give missed call on 180030002434 during office hours 10 AM to 5 PM

_________________________________________________________

Disclaimer: The performance of the product (s) is subject to usage as per manufacturer guidelines. Read enclosed leaflet of the product(s) carefully before use. The use of this product(s)/ information is at the discretion of user.

 

 


Leave a comment

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.


Explore more

Share this