"పంట మార్పిడి" [Crop Rotation] - ప్రయోజనాలు మరియు లాభాలు!

1 comment

"పంట మార్పిడి" అనగా మట్టి ఆరోగ్యాన్ని మెరుగుపరచి, సారవంతం చేసి మరియు తీవ్రమైన తెగులు తెగుళ్లు, కలుపు సమస్యలను అదుపులో పెట్టడానికి ఒకే భూమిలో వివిధ రకాల పంటలను వరుసగా పండించడం. పంట మార్పిడి చేయడం ద్వారా పొలంలో తెగుళ్ళు మరియు చీడ పీడలు వృద్ధి చెందటానికి ప్రతికూల పరిస్థితిలు ఏర్పడి తీవ్రతను తగ్గిస్తుంది తద్వారా పంట నష్టం అంతగా ఉండదు.

      Crop Rotation Example in India

 

పంట మార్పిడి నమూనా (crop rotation pattern) రెండు నుంచి మూడు లేదా పదినుండి పన్నెండు పంటల వరకు ఉండవచ్చు.

ఉదాహరణ: 

1. టమాట - మొక్క జొన్న -  బీట్ రూట్ - కోసుపంటలు - తీగ పంటలు - పప్పు పంటలు - క్యారట్ - కొత్తిమీర - టమాట 

 2. వరి - మినుములు - కూరగాయలు - పప్పు దినుసులు - మొక్క జొన్న- లేదా ప్రత్తి - వరి

పంట మార్పిడి - ఎందుకు?

ఒకే రకమైన లేదా ఒకే జాతి పంటలు ప్రతిసారి పండించడం వల్ల రోగకారక కణాల దాడి తీవ్రత ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి.  

ఉదాహరణ: టమాటా తరువాత టమాటా (ఒకే రకం), టమాటా తరువాత బంగాళా దుంప లేదా వంగ లేదా మిర్చి లేదా కాప్సికం  (ఒక్కటే  జాతి (సోలానో సీయే) పంటలు).

  1. టమాట/ బంగాళా దుంప/ కాప్సికం
  2. అగ్గి మచ్చ తెగులు (ఎర్లీ బ్లైట్) - టమాట/ బంగాళా దుంప/ కాప్సికం
  3. బాక్టీరియా మచ్చ (బాక్టీరియా స్పెక్) - టమాట/ బంగాళా దుంప/ మిర్చి/ కాప్సికం/ వంగ
  4. విల్ట్ తెగులు (బాక్టీరియా మరియు శిలింద్ర విల్ట్) టమాట/ బంగాళా దుంప/ మిర్చి/ కాప్సికం/ వంగ
  5. తామర పురుగులు - టమాట/ బంగాళా దుంప/ మిర్చి/ కాప్సికం/ వంగ
  6. కాయ తొలుచు పురుగులు - టమాట/ బంగాళా దుంప/ మిర్చి/ కాప్సికం

ఒక్కటే రకం మరియు ఒక్కటే జాతి పంటలు ఒక్క పంట తరువాత ఒక్క పంటలు ఒక్కటే మట్టిలో పండిస్తే, ఒకే రకమైన, ఒకే జాతి పంటలను ఆశించే తెగుళ్లు మరియు కీటకాల దాడిని నియంత్రించడం చాల కష్టము మరియు పంటలు పూర్తిగా నాశనం అవ్వొచ్చు. 

 Diseases of potato and tomato

  1. అందుకే పంట మార్పిడి చెయ్యడం వల్ల తెగుళ్లు మరియు కీటకాల దాడిని తగ్గించవచ్చు. పంట మార్పిడి చేయడం ద్వారా పొలంలో పురుగులు మరియు ప్రాణాంతక తెగుళ్లు వృద్ధి చెందటానికి ప్రతికూల పరిస్థితిలు ఏర్పడతాయి. 
  2. పంట మార్పిడి చేయడంవల్ల మట్టి సారవంతం అవుతుంది మరియు మట్టి ఉత్పాదకత స్థిరంగా కాపాడవచ్చు.

పంట మార్పిడి లో తీసుకోవాల్సిన మెళకువలు:

  • పంట మార్పిడి లో నేల ఉపరితలాన్ని పూర్తిగా కప్పే పంటల్ని ఎంపిక చేసుకోవాలి. శనగ, బొబ్బెర, పెసర, మినుము   వంటి పంటల్ని   వేసుకోవడం వళ్ళ  నేలను పూర్తిగా కప్పి ఉంచుతాయి దీని వల్ల కలుపు మొక్కలను నివారించవచ్చు
  • వరి తర్వాత మినుము, పెసర ,వేరుశెనగ, చెరకు వేయడం వల్ల సుడిదోమ మరియు తుంగ్రో వైరస్ ను నివారించవచ్చు.
  • పత్తి సాగు చేసిన నేలలో మినుము, పెసర వంటివి వేయడం వల్ల తెల్ల దోమ ఉధృతి తగ్గుతుంది.
  • వేరుశనగ తర్వాత జొన్న, మొక్క జొన్న, పొద్దు తిరుగుడు వంటి ఆరుతడి పంటలను వెయ్యాలి దీనివల్ల వేరుశనగ పంటను ఆశించే ఆకు ముడత ఉదృతిని తగ్గించవచ్చు
  • పసుపు తర్వాత వరి, జొన్న వంటి పైర్లను సాగు చేసుకోవాలి దీని వల్ల నేల లో నెమటోడ్ల సంఖ్య తగ్గుతుంది.
  • నులిపురుగుల సమస్య అధికంగా ఉన్నప్రదేశంలో  వేరుశెనగ, మిరప, పొగాకు, వంగ పంటలను కొంత కాలం పాటు  తప్పనిసరిగా ఆపాలి.

                                      ******

Created By: 

Shirisha Rudraraju

SME, Bighaat

                                *****************

Image courtesy: Google

++++++++++++++++++++++++++++++++++++++

For more information kindly call on 8050797979 or give missed call on 180030002434 during office hours 10 AM to 5 PM

--------------------------------------------------------- --------------------------

Disclaimer: The performance of the product (s) is subject to usage as per manufacturer guidelines. Read enclosed leaflet of the product(s) carefully before use. The use of this product(s)/ information is at the discretion of user.


1 comment


  • Shalini

    Hi english lo ledha


Leave a comment

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.


Explore more

Share this